వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : శ్రావణ మాసంలో అత్యంత పవిత్రంగా భావించే వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.శుక్రవారం మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో సంప్రదాయబద్ధంగా వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించి,అమ్మవారికి ప్రత్యేక పూజలు సమర్పించారు.ఈ సందర్భంగా మహిళలు తెల్లవారుజామునే లేచి ఇళ్లను శుభ్రం చేసుకుని, కొత్త వస్త్రాలు ధరించి పసుపు,కుంకుమ,వివిధ రకాల పువ్వులతో అమ్మవారిని శోభాయమానంగా అలంకరించారు.కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ వరలక్ష్మీదేవిని వేడుకున్నారు.పూజా కార్యక్రమాల అనంతరం ముత్తైదువులకు,పెద్దలకు, పిల్లలకు తాంబూలంతో పాటు వాయనాలు అందజేసి పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.పరస్పరం వాయనాలు ఇచ్చిపుచ్చుకుంటూ మహిళలు ఎంతో ఆనందోత్సాహాల నడుమ వేడుకలు జరుపుకున్నారు.సంప్రదాయాలు, ఆచారాలను కొనసాగిస్తూ కుటుంబ సభ్యులంతా ఒక్కటై ఈ వేడుకల్లో పాల్గొనడంతో ప్రతి ఇంటిలోనూ పండుగ శోభ ఉట్టిపడింది.
Reporter
వాస్తవ గమ్యం