వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి, జూన్ 21: మందమరి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన మంద తిరుమల్ను ఆదివారం సాయంత్రం సింగరేణి రిటైర్డ్ కార్మిక అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి, స్వీట్లు అందజేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ, పార్టీ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి మంద తిరుమల్ కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు వాసాల శంకర్, ఉపాధ్యక్షుడు పోలు సంపత్, జక్కం రాజన్న, కార్యదర్శి శనిగారపు రాజేష్, కోశాధికారి ఆసం కొమరన్న, ప్రచార కార్యదర్శి దాసరి ఎల్లారం, నాయకులు జెట్టి రవి, గసిగంటి మల్లయ్య, తుంగపిండి శంకర్, పసునూటి నరసయ్య, చంద్రగిరి కొమురయ్య, చిప్పకుర్తి గట్టయ్య, వడ్లకొండ పీరయ్య, రాజేశం, మహేష్, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం