Tuesday, 28 July 2026 11:12:15 PM
# అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.

రొయ్యలపల్లిలో హై ఓల్టేజ్ కలకలం శాశ్వత పరిష్కారం చూపకపోతే ఆందోళనలు తప్పవు

తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఎర్మ పున్నం హెచ్చరిక

Date : 21 May 2026 05:13 PM Views : 809

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : గ్రామంలో సరఫరా అవుతున్న హై ఓల్టేజ్ విద్యుత్ సమస్యను తక్షణమే పరిష్కరించి, ప్రజల ప్రాణాలను కాపాడాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం డిమాండ్ చేసింది. నెల రోజులుగా హై ఓల్టేజ్ కారణంగా షార్ట్ సర్క్యూట్‌లు జరుగుతున్నా విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు గురువారం సంఘo ఆధ్వర్యంలో లైన్‌మెన్ శ్రీధర్‌కు గ్రామస్తులతో కలిసి వినతిపత్రం సమర్పించారు. ​ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి ఎర్మ పున్నం మాట్లాడుతూ.మండలంలోని రొయ్యలపల్లి గ్రామం గొల్లవాడలో పాత ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగించి, కొత్తది ఏర్పాటు చేసినప్పటి నుండి హై ఓల్టేజ్ విద్యుత్ సరఫరా అవుతోందని తెలిపారు. ​"ట్రాన్స్‌ఫార్మర్‌కు ఎర్తింగ్ సరిగ్గా లేకపోవడం వల్లే నెల రోజులుగా షార్ట్ సర్క్యూట్‌లు జరుగుతున్నాయి. దీనివల్ల ఇళ్లలోని త్రాగునీటి మోటార్లు కాలిపోయి ప్రజలు నష్టపోతున్నారు. గతంలోనూ ఇలాంటి హై ఓల్టేజ్, షార్ట్ సర్క్యూట్ ప్రమాదాల కారణంగా గ్రామంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని ఈ సందర్భంగా వారు గుర్తుచేశారు. ఈ తీవ్రమైన సమస్యపై విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేయగా, వారు కేవలం తాత్కాలికంగా రిపేర్ చేసి వదిలేశారే తప్ప, శాశ్వత పరిష్కారం చూపలేదని మండిపడ్డారు.మరోసారి అలాంటి ప్రాణ నష్టం జరగకముందే అధికారులు స్పందించి, తగిన జాగ్రత్తలు తీసుకొని సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ​ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కోర్తే సమ్మయ్య, గ్రామస్తులు కొండగుర్ల రాజన్న, జిమిడే రాజమల్లు, కోట సురేష్ తదితరులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: