Vastava Gamyam - తెలంగాణ / ఆసిఫాబాద్ : ఐటీడీఏ-ఉట్నూర్ ప్రాజెక్ట్ అధికారిగా మంద మకరందు నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తెలంగాణా గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సంఘం (టీఎస్టీడబ్ల్యూటీయూ) కుంరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా శాఖ తరఫున బుధవారం ఐటీడీఏ కార్యాలయంలో ఘన సన్మానం నిర్వహించింది. పూలగుచ్ఛం, శాలువా, మెమెంటో అందజేసి నూతన అధికారికి స్వాగతం పలికారు.ఉపాధ్యాయుల సమస్యలు ఆశ్రమ, ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు చెందిన పాత సమస్యలు, సిఆర్టీల అంశాలు, ఉపాధ్యాయులపై తీసుకున్న చర్యల ఉపసంహరణ, పిఎంఆర్సి కార్యాలయాల బలోపేతం వంటి డిమాండ్లను సంఘం నేతలు నేరుగా ప్రాజెక్ట్ అధికారి దృష్టికి తీసుకెళ్లారు.అన్ని సమస్యలు ఓపికగా విన్న మకరందు, త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మారుమూల ప్రాంతాల్లో పనిచేసే ఉపాధ్యాయులకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. గిరిజన ఉపాధ్యాయుల శ్రేయస్సు కోసం టీఎస్టీడబ్ల్యూటీయూ నిరంతరం కృషి చేయాలని కూడా సూచించారు.కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాథోడ్ రవీందర్, ప్రధాన కార్యదర్శులు నైతం కృష్ణరావ్, మడావి గోపాల్, కోశాధికారి కూడ్మే అనంత్ సహా పలువురు సంఘ నేతలు పాల్గొన్నారు
Admin
Vastava Gamyam