వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : తిర్యాని , ప్రజలకు విద్యుత్ సరాపరాలో ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాటి పరిష్కారమే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని మందగూడ సర్పంచ్ తుమ్రం గోపాల్ అన్నారు. తిర్యాని మండలంలోని మందగూడ పంచాయతీ పరిధిలోని కింది గూడ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలకు నూతన విద్యుత్ లైన్ ఏర్పాటుతోపాటు వీధిదీపాలను అమర్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కింది గూడెం గ్రామం అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉండడం వీధి దీపాలు లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొనే వారన్నారు. అలాగే కొన్ని విద్యుత్ స్తంభాలకు రెండే విద్యుత్ వైర్లు ఏర్పాటు చేయడం వల్ల వాటికి అమర్చిన వీధిలైట్లు ఆనఫ్ బాక్స్ ఏర్పాటు చేయకపోవడం వల్ల నిత్యం వెలుగుతూ ఉండేవని, దీనికోసం మరో విద్యుత్ వైరును అమర్చి ఆనఫ్ బాక్సును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు . ఈ సమస్య పరిష్కారానికి పూర్తి సహకారం అందించిన ఎంపీడీవో నగేష్ తోపాటు విద్యుత్ శాఖ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు .ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం