Tuesday, 28 July 2026 12:56:15 PM
# కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. # పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి. # చెన్నూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ పతాక దత్తత దినోత్సవం # 54 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు విజయవంతం. # జైపూర్ ఎంపీపీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం.

విద్యుత్ సమస్యల పరిష్కారమే లక్ష్యం

Date : 21 July 2026 06:54 AM Views : 105

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : తిర్యాని , ప్రజలకు విద్యుత్ సరాపరాలో ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాటి పరిష్కారమే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని మందగూడ సర్పంచ్ తుమ్రం గోపాల్ అన్నారు. తిర్యాని మండలంలోని మందగూడ పంచాయతీ పరిధిలోని కింది గూడ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలకు నూతన విద్యుత్ లైన్ ఏర్పాటుతోపాటు వీధిదీపాలను అమర్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కింది గూడెం గ్రామం అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉండడం వీధి దీపాలు లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొనే వారన్నారు. అలాగే కొన్ని విద్యుత్ స్తంభాలకు రెండే విద్యుత్ వైర్లు ఏర్పాటు చేయడం వల్ల వాటికి అమర్చిన వీధిలైట్లు ఆనఫ్ బాక్స్ ఏర్పాటు చేయకపోవడం వల్ల నిత్యం వెలుగుతూ ఉండేవని, దీనికోసం మరో విద్యుత్ వైరును అమర్చి ఆనఫ్ బాక్సును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు . ఈ సమస్య పరిష్కారానికి పూర్తి సహకారం అందించిన ఎంపీడీవో నగేష్ తోపాటు విద్యుత్ శాఖ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు .ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

MULAMATAM SHIVA PRASAD

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :