వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల: చిన్నారుల్లో దాగి ఉన్న సృజనాత్మక ప్రతిభను గుర్తించి, వారి కలలను సాకారం చేసే దిశగా తల్లిదండ్రులు నిరంతరం ప్రోత్సహించాలని మహిళా కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షురాలు, కార్పొరేటర్ పెంట రజిత అన్నారు. ఆదివారం మంచిర్యాలలోని ఎంఎన్సీఎల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి నృత్య పోటీలను ఆమె ప్రారంభించారు.ఈ సందర్భంగా సినీ, సాంస్కృతిక, జానపద విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి సుమారు 350 మంది యువ కళాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. విజేతలను అభినందించిన రజిత, కళలను ప్రోత్సహించడం ద్వారా భావి తరానికి గొప్ప అవకాశాలు కల్పించవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు మధు, సంతోష్, టెక్నో శ్రీధర్, లక్ష్మణ్తో పాటు సీనియర్ కళాకారుడు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం