వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని ఎదులపాడ్ గ్రామ పంచాయతీలో హరితహారం కార్యక్రమంలో భాగంగా స్థానిక సర్పంచ్ శ్రీమతి మడావి పార్వతి అంబారావు ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు ప్రతి ఇంటికీ మొక్కలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మడావి పార్వతి అంబారావు మాట్లాడుతూ, "ప్రతి ఇంటి ఆవరణలో ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత. నేడు నాటిన మొక్కలే రేపటి తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందిస్తాయి. గ్రామాన్ని పచ్చదనంతో నింపేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలి" అని పిలుపునిచ్చారు.ప్రభుత్వం చేపడుతున్న హరిత కార్యక్రమాలను విజయవంతం చేయడంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని, మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి కొట్టె అశోక్, మల్టీ పర్పస్ వర్కర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం