Vastava Gamyam - తెలంగాణ / మంచిర్యాల : నీట్ యూజీ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని పిడిఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి. శ్రీకాంత్ డిమాండ్ చేశారు. బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.కార్పొరేట్ మాఫియా పేపర్ లీకేజీ వెనుక ఉన్న కార్పొరేట్ శక్తులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి.వరుస వైఫల్యాలకు నిలయంగా మారిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ని రద్దు చేయాలి. వైద్య విద్యా ప్రవేశాల బాధ్యతను తిరిగి రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించాలి. 25 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రం ఆడుకుంటోందని, ఈ లీకేజీల వల్ల పేద, గ్రామీణ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పిడిస్ యూ నాయకులు కార్తీక్, వంశీ, అంజి తదితరులు పాల్గొన్నారు.
Admin
Vastava Gamyam