వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ఘనంగా జాతీయ మత్స్యకారుల దినోత్సవ వేడుకలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న గంగపుత్రులు మంచిర్యాల, జూలై 10: జాతీయ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా వద్ద డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం సమీపంలో తెలంగాణ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేస్తూ ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ గంగపుత్ర సంఘం జిల్లా అధ్యక్షుడు నేన్నెల నరసయ్య, పట్టణ అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ గంగపుత్రుల సామాజిక, విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ అభివృద్ధిలో ఆశించిన పురోగతి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పాలించిన ప్రభుత్వాలు, ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కూడా గంగపుత్రుల సంక్షేమానికి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని విమర్శించారు. మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీకి బదులుగా నగదు బదిలీ చేయాలని, గత 12 సంవత్సరాలుగా మరణించిన 986 మంది మత్స్యకారుల కుటుంబాలకు పెండింగ్లో ఉన్న ఎక్స్గ్రేషియా తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే అర్హులైన మత్స్యకారులందరికీ 90 శాతం సబ్సిడీపై ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలు అందించాలని, మత్స్యకార సహకార సంఘాల సభ్యులందరికీ రూ.20 లక్షల బీమా, ఎక్స్గ్రేషియా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ యువజన అధ్యక్షుడు మంచెర్ల సదానందం, శాఖపురం భీమ్సేన్, గగ్గూరి రాజన్న, మనోహర్, రాజన్న తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం