Wednesday, 29 July 2026 05:48:33 PM
# అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.

ఘనంగా జాతీయ మత్స్యకారుల దినోత్సవ వేడుకలు

కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుంటున్న గంగ పుత్రులు

Date : 10 July 2026 03:59 PM Views : 99

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ఘనంగా జాతీయ మత్స్యకారుల దినోత్సవ వేడుకలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న గంగపుత్రులు మంచిర్యాల, జూలై 10: జాతీయ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా వద్ద డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం సమీపంలో తెలంగాణ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేస్తూ ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ గంగపుత్ర సంఘం జిల్లా అధ్యక్షుడు నేన్నెల నరసయ్య, పట్టణ అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ గంగపుత్రుల సామాజిక, విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ అభివృద్ధిలో ఆశించిన పురోగతి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పాలించిన ప్రభుత్వాలు, ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కూడా గంగపుత్రుల సంక్షేమానికి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని విమర్శించారు. మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీకి బదులుగా నగదు బదిలీ చేయాలని, గత 12 సంవత్సరాలుగా మరణించిన 986 మంది మత్స్యకారుల కుటుంబాలకు పెండింగ్‌లో ఉన్న ఎక్స్‌గ్రేషియా తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే అర్హులైన మత్స్యకారులందరికీ 90 శాతం సబ్సిడీపై ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలు అందించాలని, మత్స్యకార సహకార సంఘాల సభ్యులందరికీ రూ.20 లక్షల బీమా, ఎక్స్‌గ్రేషియా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ యువజన అధ్యక్షుడు మంచెర్ల సదానందం, శాఖపురం భీమ్సేన్, గగ్గూరి రాజన్న, మనోహర్, రాజన్న తదితరులు పాల్గొన్నారు.

KAGITHAPU SRINIVAS

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: