Saturday, 12 September 2026 09:06:10 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

ఘనంగా జాతీయ మత్స్యకారుల దినోత్సవ వేడుకలు

కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుంటున్న గంగ పుత్రులు

Date : 10 July 2026 03:59 PM Views : 139

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ఘనంగా జాతీయ మత్స్యకారుల దినోత్సవ వేడుకలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న గంగపుత్రులు మంచిర్యాల, జూలై 10: జాతీయ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా వద్ద డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం సమీపంలో తెలంగాణ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేస్తూ ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ గంగపుత్ర సంఘం జిల్లా అధ్యక్షుడు నేన్నెల నరసయ్య, పట్టణ అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ గంగపుత్రుల సామాజిక, విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ అభివృద్ధిలో ఆశించిన పురోగతి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పాలించిన ప్రభుత్వాలు, ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కూడా గంగపుత్రుల సంక్షేమానికి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని విమర్శించారు. మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీకి బదులుగా నగదు బదిలీ చేయాలని, గత 12 సంవత్సరాలుగా మరణించిన 986 మంది మత్స్యకారుల కుటుంబాలకు పెండింగ్‌లో ఉన్న ఎక్స్‌గ్రేషియా తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే అర్హులైన మత్స్యకారులందరికీ 90 శాతం సబ్సిడీపై ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలు అందించాలని, మత్స్యకార సహకార సంఘాల సభ్యులందరికీ రూ.20 లక్షల బీమా, ఎక్స్‌గ్రేషియా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ యువజన అధ్యక్షుడు మంచెర్ల సదానందం, శాఖపురం భీమ్సేన్, గగ్గూరి రాజన్న, మనోహర్, రాజన్న తదితరులు పాల్గొన్నారు.

KAGITHAPU SRINIVAS

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: