వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆదిలాబాద్ : గిరిజన నిరుద్యోగ యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక గొప్ప అవకాశాన్ని ముందుకు తెచ్చింది. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్ ద్వారా ఆస్ట్రేలియా, జర్మనీ, ఒమన్ వంటి దేశాలలో వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు ఐ.టి.డి.ఏ. ఉట్నూర్ ప్రాజెక్ట్ అధికారి శ్రీ మంద మకరందు ఒక ప్రకటనలో తెలిపారు.మొత్తం 636 ఖాళీల కోసం ఈ నోటిఫికేషన్ విడుదలయ్యింది.ఎంపికైన అభ్యర్థులకు అత్యధికంగా ఏడాదికి ₹2.64 కోట్ల వరకు జీతం లభించే అవకాశం ఉంది. వయోపరిమితి అభ్యర్థుల వయస్సు 25 ఏళ్ల నుండి 45 ఏళ్ల లోపు ఉండాలి.విద్యార్హత: పోస్టును బట్టి పదవో తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా లేదా ఐటిఐ ఉత్తీర్ణులై ఉండాలి. కావలసిన పత్రాలు: ఆధార్ కార్డ్, కుల ధ్రువీకరణ పత్రం, విద్యా అర్హత సర్టిఫికెట్లు.ఆసక్తి గల గిరిజన యువత ఉట్నూర్ ఐ.టి.డి.ఏ. కార్యాలయంలోని రూమ్ నెంబర్ 7 (GSUK Office) నందు సంప్రదించవచ్చు.దరఖాస్తుల ప్రారంభం: 01.05.2026 చివరి తేదీ: 10.05.2026 అర్హత కలిగిన గిరిజన యువతీ యువకులు ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రాజెక్ట్ అధికారి కోరారు. మరింత సమాచారం కోసం ఐ.టి.డి.ఏ. కార్యాలయంలో సంప్రదించగలరు.అని కోరారు
Admin
వాస్తవ గమ్యం