Saturday, 13 June 2026 10:42:41 AM
# ఘనంగా రామ్ ప్రసాద్ బిస్మిల్ జయంతి # ​కోటపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన # పేద విద్యార్థుల చదువుల్లో వెలుగులు # *అకెనపల్లిలో గుట్టుచప్పుడు కాకుండా గ్రామసభ.. # గెలిచిన సంఘాల చేతగానితనంతోనే సింగరేణిలో నిలిచిన మెడికల్ బోర్డు: # ​గంగాపూర్ గేట్ ROB భూ సర్వే పూర్తి: గవర్నర్, # ​ఆదివాసీ భూములను లాక్కునే కుట్ర మానుకోవాలి: TAGS # ​మందమర్రిలో ఘనంగా ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ గ్రామ సభ # మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యంపై దాడి # సింగరేణి కాలరీస్ హైస్కూల్ (కల్యాణిఖని)లో ప్రవేశాలు ప్రారంభం # నదీజలాల పంపిణీలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై పార్లమెంట్‌లో నిలదీస్తాం # 16 ఏళ్ల తర్వాత ఒక్కటైన జెడ్పీహెచ్‌ఎస్ తాండూర్ 2010 బ్యాచ్ విద్యార్థులు! # ​మందమర్రి హెడ్ కానిస్టేబుల్ సురేందర్‌కు సీపీ అంబర్ కిషోర్ ఝా ప్రశంసలు # టీపీసీసీ ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా చందనగిరి శ్రీనివాస్.. # కన్నాలలో ‘అమృత్ 2.0’ పనుల పరిశీలన # ప్రత్యేక అవసరాలు గల పిల్లల గుర్తింపు నమోదు ముమ్మరం # తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి # యోగ పట్ల ప్రతి ఒక్కరు ఆసక్తి పెంచుకోవాలి... # అగ్నిప్రమాద బాధితులకు ఆర్థిక సాయం # కలెక్టర్‌ను కలిసిన బెల్లంపల్లి ఏరియా జీఎం

గోదావరిపై వంతెన కోసం పోరుబాట

మంచిర్యాలలో బీజేపీ భారీ ధర్నా

Date : 13 April 2026 04:48 PM Views : 83

Vastava Gamyam - తెలంగాణ / మంచిర్యాల : ​మంచిర్యాల పాలకుల నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది.గతంలో మంజూరైన వంతెనను రద్దు చేయడంపై మంచిర్యాల అంతర్గాం ప్రాంత వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తమ రవాణా కష్టాలు తీరాలంటే వంతెన నిర్మాణం ఒక్కటే మార్గమని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణం హోరెత్తింది.మంచిర్యాల అంతర్గాం మధ్య గోదావరి నదిపై వంతెన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఉదయం11గంటలకు ఐబీ చౌరస్తా వద్ద బీజేపీ భారీ ధర్నా నిర్వహించింది.ఈ ధర్నాకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి, జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్,చెన్నూర్ నియోజకవర్గ నాయకులు దుర్గం అశోక్ నాయకత్వం వహించారు.​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.మంచిర్యాల,పెద్దపల్లి జిల్లాలను కలిపే ఈ వంతెన నిర్మాణం ఈ ప్రాంత ఆర్థికాభివృద్ధికి ఎంతో కీలకమని పేర్కొన్నారు.​గతంలోనే ఈవంతెన మంజూరైనప్పటికీ, ప్రభుత్వం దాన్ని రద్దు చేయడం వల్ల వేలాది మంది ప్రజలు, విద్యార్థులు,రోగులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.వంతెన లేకపోవడం వల్ల కిలోమీటర్ల మేర చుట్టూ తిరిగి ప్రయాణించాల్సి వస్తోందని, తక్షణమే ప్రభుత్వం స్పందించి పనులు ప్రారంభించాలని హెచ్చరించారు.​ఈ కార్యక్రమంలో కోటపెల్లి మండలం నుండి మంత్రి రామయ్య, గుర్రం నారాయణతో పాటు వివిధ మండలాల నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. వంతెన నిర్మాణం చేపట్టాలి రవాణా కష్టాలు తీర్చాలి అంటూ చేసిన నినాదాలతో మంచిర్యాల మార్మోగింది.ప్రజల అవసరాలను గుర్తించి ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే, ఈ పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు.ఈ ధర్నాకు ప్రజల నుండి కూడా విశేష మద్దతు లభించింది.

KOMMU RAJESH

Admin

Vastava Gamyam

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :