Wednesday, 29 July 2026 11:21:04 PM
# ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి:

గోదావరిపై వంతెన కోసం పోరుబాట

మంచిర్యాలలో బీజేపీ భారీ ధర్నా

Date : 13 April 2026 04:48 PM Views : 102

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ​మంచిర్యాల పాలకుల నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది.గతంలో మంజూరైన వంతెనను రద్దు చేయడంపై మంచిర్యాల అంతర్గాం ప్రాంత వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తమ రవాణా కష్టాలు తీరాలంటే వంతెన నిర్మాణం ఒక్కటే మార్గమని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణం హోరెత్తింది.మంచిర్యాల అంతర్గాం మధ్య గోదావరి నదిపై వంతెన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఉదయం11గంటలకు ఐబీ చౌరస్తా వద్ద బీజేపీ భారీ ధర్నా నిర్వహించింది.ఈ ధర్నాకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి, జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్,చెన్నూర్ నియోజకవర్గ నాయకులు దుర్గం అశోక్ నాయకత్వం వహించారు.​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.మంచిర్యాల,పెద్దపల్లి జిల్లాలను కలిపే ఈ వంతెన నిర్మాణం ఈ ప్రాంత ఆర్థికాభివృద్ధికి ఎంతో కీలకమని పేర్కొన్నారు.​గతంలోనే ఈవంతెన మంజూరైనప్పటికీ, ప్రభుత్వం దాన్ని రద్దు చేయడం వల్ల వేలాది మంది ప్రజలు, విద్యార్థులు,రోగులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.వంతెన లేకపోవడం వల్ల కిలోమీటర్ల మేర చుట్టూ తిరిగి ప్రయాణించాల్సి వస్తోందని, తక్షణమే ప్రభుత్వం స్పందించి పనులు ప్రారంభించాలని హెచ్చరించారు.​ఈ కార్యక్రమంలో కోటపెల్లి మండలం నుండి మంత్రి రామయ్య, గుర్రం నారాయణతో పాటు వివిధ మండలాల నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. వంతెన నిర్మాణం చేపట్టాలి రవాణా కష్టాలు తీర్చాలి అంటూ చేసిన నినాదాలతో మంచిర్యాల మార్మోగింది.ప్రజల అవసరాలను గుర్తించి ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే, ఈ పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు.ఈ ధర్నాకు ప్రజల నుండి కూడా విశేష మద్దతు లభించింది.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: