Tuesday, 28 July 2026 05:30:14 PM
# తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. # పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి. # చెన్నూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ పతాక దత్తత దినోత్సవం

ఈనెల 28న జిల్లావ్యాప్తంగా నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.

జిల్లా కలెక్టర్ హరిత..

Date : 27 June 2026 04:30 PM Views : 135

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ జిల్లాలోని పిల్లల భవిష్యత్తును పోలియో మహమ్మారి బారి నుండి రక్షించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జూన్ 28 (ఆదివారం) నాడు జిల్లావ్యాప్తంగా 'పల్స్ పోలియో' చుక్కల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కె హరిత అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన గోడ ప్రతులను పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని నేనే స్వయంగా జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ అధికారి డా. కె. సీతారాం వైద్య సిబ్బందితో కలిసి ప్రారంభిస్తున్నామని అన్నారు. జిల్లా ప్రజలకు, పిల్లల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేయునది 0 నుండి 5 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న ప్రతి చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి. మన జిల్లాలో ఈ వయస్సు కలిగిన 46,516 మంది పిల్లలను గుర్తించి, అందరికీ అందేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.​దీనికోసం జిల్లావ్యాప్తంగా 3,101 వ్యాక్సిన్ వైల్స్, 667 పోలియో బూత్‌లు, 14 ట్రాన్సిట్ పాయింట్లు, 22 మొబైల్ బృందాలు, మరియు 86 రూట్ సూపర్‌వైజర్లను అందుబాటులో ఉంచాము. అన్ని PHCలు, PP యూనిట్లు, గ్రామాలు మరియు బూత్‌లలో సిబ్బంది సిద్ధంగా ఉన్నారు.ఈ బృహత్తర కార్యం కోసం మొత్తం 2,668 మంది వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది పనిచేస్తున్నారు. పోలియో చుక్కల కార్యక్రమం ఉదయం 7:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు నిరంతరాయంగా కొనసాగుతుంది. ఇటుక బట్టీల్లో పనిచేసే కుటుంబాలు, వలస కార్మికులు, సంచార జాతులు, నిర్మాణ కార్మికులు, మత్స్యకారులు, పట్టణ శివారు ప్రాంతాలు, కొత్త కాలనీలు మరియు వ్యవసాయ క్షేత్రాల్లో నివసించే హైరిస్క్ వర్గాల పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాం. ఒక్క చిన్నారి కూడా మిస్ కాకుండా చుక్కల మందు వేయాలని ఇప్పటికే ఆరోగ్య సిబ్బందిని ఆదేశించడమైనది.ఈరోజు సాధారణ ఇమ్యునైజేషన్‌లో భాగంగా పోలియో వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ, రేపు జరిగే పల్స్ పోలియో కార్యక్రమంలో మళ్లీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించుకోవాలి. ​పోలియో రహిత సమాజ స్థాపన కోసం తల్లిదండ్రులందరూ బాధ్యతగా తమ 5 సంవత్సరాల లోపు పిల్లలను సమీపంలోని పోలియో బూత్‌కు తీసుకువచ్చి, తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు సోమ మంగళవారాలలో సంబంధిత వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు పంపిణీ చేస్తారని అన్నారు..

V SAMYUKTHA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :