Saturday, 12 September 2026 05:48:07 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

ఈనెల 28న జిల్లావ్యాప్తంగా నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.

జిల్లా కలెక్టర్ హరిత..

Date : 27 June 2026 04:30 PM Views : 163

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ జిల్లాలోని పిల్లల భవిష్యత్తును పోలియో మహమ్మారి బారి నుండి రక్షించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జూన్ 28 (ఆదివారం) నాడు జిల్లావ్యాప్తంగా 'పల్స్ పోలియో' చుక్కల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కె హరిత అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన గోడ ప్రతులను పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని నేనే స్వయంగా జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ అధికారి డా. కె. సీతారాం వైద్య సిబ్బందితో కలిసి ప్రారంభిస్తున్నామని అన్నారు. జిల్లా ప్రజలకు, పిల్లల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేయునది 0 నుండి 5 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న ప్రతి చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి. మన జిల్లాలో ఈ వయస్సు కలిగిన 46,516 మంది పిల్లలను గుర్తించి, అందరికీ అందేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.​దీనికోసం జిల్లావ్యాప్తంగా 3,101 వ్యాక్సిన్ వైల్స్, 667 పోలియో బూత్‌లు, 14 ట్రాన్సిట్ పాయింట్లు, 22 మొబైల్ బృందాలు, మరియు 86 రూట్ సూపర్‌వైజర్లను అందుబాటులో ఉంచాము. అన్ని PHCలు, PP యూనిట్లు, గ్రామాలు మరియు బూత్‌లలో సిబ్బంది సిద్ధంగా ఉన్నారు.ఈ బృహత్తర కార్యం కోసం మొత్తం 2,668 మంది వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది పనిచేస్తున్నారు. పోలియో చుక్కల కార్యక్రమం ఉదయం 7:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు నిరంతరాయంగా కొనసాగుతుంది. ఇటుక బట్టీల్లో పనిచేసే కుటుంబాలు, వలస కార్మికులు, సంచార జాతులు, నిర్మాణ కార్మికులు, మత్స్యకారులు, పట్టణ శివారు ప్రాంతాలు, కొత్త కాలనీలు మరియు వ్యవసాయ క్షేత్రాల్లో నివసించే హైరిస్క్ వర్గాల పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాం. ఒక్క చిన్నారి కూడా మిస్ కాకుండా చుక్కల మందు వేయాలని ఇప్పటికే ఆరోగ్య సిబ్బందిని ఆదేశించడమైనది.ఈరోజు సాధారణ ఇమ్యునైజేషన్‌లో భాగంగా పోలియో వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ, రేపు జరిగే పల్స్ పోలియో కార్యక్రమంలో మళ్లీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించుకోవాలి. ​పోలియో రహిత సమాజ స్థాపన కోసం తల్లిదండ్రులందరూ బాధ్యతగా తమ 5 సంవత్సరాల లోపు పిల్లలను సమీపంలోని పోలియో బూత్‌కు తీసుకువచ్చి, తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు సోమ మంగళవారాలలో సంబంధిత వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు పంపిణీ చేస్తారని అన్నారు..

V SAMYUKTHA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :