వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ జిల్లాలోని పిల్లల భవిష్యత్తును పోలియో మహమ్మారి బారి నుండి రక్షించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జూన్ 28 (ఆదివారం) నాడు జిల్లావ్యాప్తంగా 'పల్స్ పోలియో' చుక్కల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కె హరిత అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన గోడ ప్రతులను పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని నేనే స్వయంగా జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ అధికారి డా. కె. సీతారాం వైద్య సిబ్బందితో కలిసి ప్రారంభిస్తున్నామని అన్నారు. జిల్లా ప్రజలకు, పిల్లల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేయునది 0 నుండి 5 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న ప్రతి చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి. మన జిల్లాలో ఈ వయస్సు కలిగిన 46,516 మంది పిల్లలను గుర్తించి, అందరికీ అందేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.దీనికోసం జిల్లావ్యాప్తంగా 3,101 వ్యాక్సిన్ వైల్స్, 667 పోలియో బూత్లు, 14 ట్రాన్సిట్ పాయింట్లు, 22 మొబైల్ బృందాలు, మరియు 86 రూట్ సూపర్వైజర్లను అందుబాటులో ఉంచాము. అన్ని PHCలు, PP యూనిట్లు, గ్రామాలు మరియు బూత్లలో సిబ్బంది సిద్ధంగా ఉన్నారు.ఈ బృహత్తర కార్యం కోసం మొత్తం 2,668 మంది వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది పనిచేస్తున్నారు. పోలియో చుక్కల కార్యక్రమం ఉదయం 7:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు నిరంతరాయంగా కొనసాగుతుంది. ఇటుక బట్టీల్లో పనిచేసే కుటుంబాలు, వలస కార్మికులు, సంచార జాతులు, నిర్మాణ కార్మికులు, మత్స్యకారులు, పట్టణ శివారు ప్రాంతాలు, కొత్త కాలనీలు మరియు వ్యవసాయ క్షేత్రాల్లో నివసించే హైరిస్క్ వర్గాల పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాం. ఒక్క చిన్నారి కూడా మిస్ కాకుండా చుక్కల మందు వేయాలని ఇప్పటికే ఆరోగ్య సిబ్బందిని ఆదేశించడమైనది.ఈరోజు సాధారణ ఇమ్యునైజేషన్లో భాగంగా పోలియో వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ, రేపు జరిగే పల్స్ పోలియో కార్యక్రమంలో మళ్లీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించుకోవాలి. పోలియో రహిత సమాజ స్థాపన కోసం తల్లిదండ్రులందరూ బాధ్యతగా తమ 5 సంవత్సరాల లోపు పిల్లలను సమీపంలోని పోలియో బూత్కు తీసుకువచ్చి, తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు సోమ మంగళవారాలలో సంబంధిత వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు పంపిణీ చేస్తారని అన్నారు..
Reporter
వాస్తవ గమ్యం