వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కార్మిక వర్గ ప్రయోజనాలే లక్ష్యంగా ఆవిర్భవిస్తున్న కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా విజయవంతం చేయాలని హెచ్.ఎం.ఎస్ఏరియా వైస్ ప్రెసిడెంట్ పతెం రాజబాబు పిలుపునిచ్చారు. ఈ నెల 25వ తేదీన జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత నూతన రాజకీయ పార్టీని ప్రకటించనున్న నేపథ్యంలో, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని గోలేటి సీహెచ్పీలో పార్టీ ఆవిర్భావ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా రాజబాబు మాట్లాడుతూ, కార్మికుల గొంతుకగా ఈ పార్టీ నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ ప్రకటించనున్న ఏప్రిల్ 25వ తేదీని చారిత్రాత్మక దినంగా మార్చాలని కార్యకర్తలకు, కార్మికులకు సూచించారు. బెల్లంపల్లి ఏరియా వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల పిట్ సెక్రెటరీ బాలేష్, అసిస్టెంట్ పిట్ సెక్రెటరీ రాజేష్, ఏరియా ఆర్గనైజర్ దీపక్ రాజ్, పలువురు కార్మికులు మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం