Tuesday, 28 July 2026 10:47:51 PM
# అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.

గిరిజన సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ రమాదేవి రాజేంద్రప్రసాద్‌కు ఘన సన్మాన వీడ్కోలు

Date : 05 July 2026 04:12 PM Views : 80

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్: గిరిజన సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీమతి రమాదేవి రాజేంద్రప్రసాద్‌కు ఆత్మీయ సన్మాన వీడ్కోలు సభ శనివారం రాత్రి ఆసిఫాబాద్ పట్టణంలోని వడ్డేపల్లి గార్డెన్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క ముఖ్య అతిథిగా హాజరై రమాదేవి దంపతులను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ.రమాదేవి దాదాపు మూడు సంవత్సరాల పాటు గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా సమర్థవంతంగా సేవలందించడంతో పాటు, అదనంగా మరో నాలుగు శాఖలకు ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తూ విశిష్ట సేవలు అందించారని అన్నారు. ఆమె ఉద్యోగ జీవితం మొత్తం గిరిజన ప్రాంతాల అభివృద్ధి, గిరిజనుల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేశారని కొనియాడారు.ఏటూరు నాగారం, ములుగు, భద్రాచలం, ఉట్నూర్ ఐటీడీఏ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తూ గిరిజనుల సంక్షేమం, విద్య, విశేష కృషి చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలో ఆమె చూపిన నిబద్ధత, నిజాయితీ, సేవాభావం అందరికీ ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు.ఆమె భవిష్యత్ జీవితం సుఖసంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ డేవిడ్, పివిటిజి ఏపీఓ ఆత్రం భాస్కర్, ఏజెన్సీ డిప్యూటీ డివో గోడం చందాన్ష డిస్టిక్ స్పోర్ట్స్ ఆఫీసర్స్ మాడవి శేక్కు,జీవరత్నం,GCDO శకుంతల. క్రికెటర్ నాగేందర్,కొమరం భీమ్ జిల్లా ఏటిడిఓ,హెడ్ మాస్టర్స్ SCRP'S, PD'S 'ఉపాధ్యాయులు.. కృష్ణారావు, మీనా రెడ్డి,కనక వెంకటేశ్వరరావు, శ్యామ్ రావు.. ఆదివాసి సంఘాల నాయకులు సీడం అర్జున్ మాస్టర్, పేందర్ సుధాకర్, ఆత్రం భీమ్రావు, బుర్సా పోచయ్య, ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

V SAMYUKTHA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :