వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల కార్పొరేషన్ పరిధ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నెలకొన్న ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బీఆర్ఎస్ నాయకులు కార్పొరేషన్ కమిషనర్కు వినతిపత్రం సమర్పించారు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్ కుమార్ ఆదేశాల మేరకు మంచిర్యాల పట్టణ బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు గాదె సత్యం ఆధ్వర్యంలో నాయకులు కమిషనర్ను కలిసి ప్రజా సమస్యలపై వినతిపత్రం అందజేశారు. కార్పొరేషన్ పరిధిలో తాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, రహదారులు, వీధి దీపాలు తదితర మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సత్తార్, మాజీ కౌన్సిలర్లు తోట తిరుపతి, పోరెడ్డి రాజు, నాయకులు ఓడ్నాల రవీందర్, పడాల రవీందర్, బల్లికొండ రమేష్, జాడి భానుచందర్, జక్కం జగన్, బొడ్డు పద్మ, పుప్పాల స్వర్ణాకర్, కుందరపు రమేష్, నక్క తిరుపతి, జావిద్, రామగిరి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం