Saturday, 12 September 2026 04:51:58 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

99 రోజుల ప్రజాపాలనకు డాక్యుమెంటేషన్ తప్పనిసరి

Date : 25 June 2026 08:32 PM Views : 200

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : 25: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో శాఖల వారీగా సాధించిన లక్ష్యాలు, ప్రజల సమస్యల పరిష్కారం, పెండింగ్ అంశాలు, భవిష్యత్ కార్యాచరణపై సమగ్ర డాక్యుమెంటేషన్ రూపొందించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ అధికారులను ఆదేశించారు.నస్పూర్ సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో సాలిడ్, లిక్విడ్ వ్యర్థాల నిర్వహణ, తెలంగాణ జలసిరి కార్యక్రమం, ఇంకుడు గుంతలు, పంటకుంటల ఏర్పాటు వంటి కార్యక్రమాలను వేగవంతం చేయాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆరోగ్య పరీక్షలు, విద్యార్థుల యూనిఫారాల తయారీ, మహిళా సంఘాలకు ఉపాధి అవకాశాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. అలాగే మాదకద్రవ్యాల నిర్మూలన, పంట మార్పిడి విధానంపై రైతులకు అవగాహన, విద్యాభివృద్ధి, పింఛన్ల జీవన ప్రమాణీకరణ, జాతీయ కుటుంబ ప్రయోజన పథకం అమలు వంటి అంశాల్లో అధికారులు చురుకుగా పనిచేయాలని సూచించారు. ప్రజావాణిలో వచ్చిన ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి పారదర్శకంగా పరిష్కరించాలని ఆదేశించారు.జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, సంక్షేమ రంగాల్లో జిల్లాలో గణనీయమైన పురోగతి సాధించినట్లు తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 10,305 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, 2,132 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యిందని వెల్లడించారు. బడిబాట, క్షయ నిర్మూలన, రహదారి భద్రత, బాలికల విద్య, రైతు అవగాహన కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.అనంతరం మండల స్థాయి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన కమిషనర్ గ్రామపంచాయతీలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని, పారిశుద్ధ్యం, ప్లాస్టిక్ నియంత్రణ, వీధిదీపాల నిర్వహణ, గ్రామ ఆర్థిక వనరుల పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

BEERAM SHARATH CHANDHRA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :