Tuesday, 28 July 2026 03:08:48 PM
# తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. # పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి. # చెన్నూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ పతాక దత్తత దినోత్సవం

99 రోజుల ప్రజాపాలనకు డాక్యుమెంటేషన్ తప్పనిసరి

Date : 25 June 2026 08:32 PM Views : 168

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : 25: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో శాఖల వారీగా సాధించిన లక్ష్యాలు, ప్రజల సమస్యల పరిష్కారం, పెండింగ్ అంశాలు, భవిష్యత్ కార్యాచరణపై సమగ్ర డాక్యుమెంటేషన్ రూపొందించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ అధికారులను ఆదేశించారు.నస్పూర్ సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో సాలిడ్, లిక్విడ్ వ్యర్థాల నిర్వహణ, తెలంగాణ జలసిరి కార్యక్రమం, ఇంకుడు గుంతలు, పంటకుంటల ఏర్పాటు వంటి కార్యక్రమాలను వేగవంతం చేయాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆరోగ్య పరీక్షలు, విద్యార్థుల యూనిఫారాల తయారీ, మహిళా సంఘాలకు ఉపాధి అవకాశాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. అలాగే మాదకద్రవ్యాల నిర్మూలన, పంట మార్పిడి విధానంపై రైతులకు అవగాహన, విద్యాభివృద్ధి, పింఛన్ల జీవన ప్రమాణీకరణ, జాతీయ కుటుంబ ప్రయోజన పథకం అమలు వంటి అంశాల్లో అధికారులు చురుకుగా పనిచేయాలని సూచించారు. ప్రజావాణిలో వచ్చిన ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి పారదర్శకంగా పరిష్కరించాలని ఆదేశించారు.జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, సంక్షేమ రంగాల్లో జిల్లాలో గణనీయమైన పురోగతి సాధించినట్లు తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 10,305 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, 2,132 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యిందని వెల్లడించారు. బడిబాట, క్షయ నిర్మూలన, రహదారి భద్రత, బాలికల విద్య, రైతు అవగాహన కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.అనంతరం మండల స్థాయి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన కమిషనర్ గ్రామపంచాయతీలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని, పారిశుద్ధ్యం, ప్లాస్టిక్ నియంత్రణ, వీధిదీపాల నిర్వహణ, గ్రామ ఆర్థిక వనరుల పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

BEERAM SHARATH CHANDHRA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :