Vastava Gamyam - తెలంగాణ / ఆసిఫాబాద్ : కాగజనగర్ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె.హరిత ఆదేశించారు. గురువారం ఆమె కాగజ్నగర్ పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌక్ నుండి రాజ్ టాకీస్ చౌరస్తా వరకు గల రహదారిని మున్సిపల్ అధికారులు, వార్డు కౌన్సిలర్లతో కలిసి స్వయంగా పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.మున్సిపల్ సిబ్బంది ప్రతిరోజూ మురుగు కాలువలను శుభ్రం చేయాలని, తడి-పొడి చెత్తను క్రమం తప్పకుండా సేకరించాలని స్పష్టం చేశారు. తనిఖీల్లో భాగంగా రోడ్డుపై నీరు, ఎంగిలి ప్లేట్లు పడేసిన ‘గురుకృప టిఫిన్ సెంటర్’ యజమానికి జరిమానా విధించాలని మున్సిపల్ కమిషనర్ తిరుపతిని ఆదేశించారు. వ్యాపారులు, ప్రజలు ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లను రోడ్లపై వేయకుండా చెత్తకుండీల్లోనే వేయాలని, కాగజ్నగర్ను స్వచ్ఛమైన పట్టణంగా మార్చడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ అధికారులు, వార్డు కౌన్సిలర్లు మరియు పౌర సంబంధాల శాఖ అధికారులు పాల్గొన్నారు.
Admin
Vastava Gamyam