వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి కళ్యాణ లక్ష్మీ–షాదీ ముబారక్ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం మందమర్రి పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు, చెన్నూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆదేశాలతో ఈ ఆందోళన చేపట్టినట్లు నాయకులు తెలిపారు.మందమర్రి పట్టణం, మండలం, క్యాతన్పల్లి మున్సిపాలిటీకి చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించే కళ్యాణ లక్ష్మీ–షాదీ ముబారక్ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. గతంలో అమలైన రూ.1,00,116 ఆర్థిక సహాయాన్ని కొనసాగించాలని కోరారు.కళ్యాణ లక్ష్మీ పథకం పేద కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని, ప్రభుత్వం ఈ పథకంపై స్పష్టత ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు. పథకాన్ని నిలిపివేస్తే రానున్న రోజుల్లో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో క్యాతన్పల్లి మున్సిపల్ చైర్పర్సన్ సంధ్యారాణి, డాక్టర్ రాజారమేష్తో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, TBGKS యూనియన్ నాయకులు, వార్డు అధ్యక్షులు, యువజన, విద్యార్థి, సోషల్ మీడియా విభాగాల నాయకులు, మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం