వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : సిర్పూర్ రేంజ్ పరిధిలో బీడీ ఆకు సేకరణదారులు వన్యప్రాణుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎఫ్డివో అప్పయ్య సూచించారు. ఆకులు సేకరించేటప్పుడు గుంపులుగా వెళ్లి, మాట్లాడుకుంటూ లేదా చప్పుడు చేస్తూ పని చేయాలని తెలిపారు. ఇటుకలపహాడ్, చీలపల్లి, మాలిని ప్రాంతాల్లో పులి సంచారం ఉన్నందున ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా పలు బీడీ ఆకు కల్లాలను పరిశీలించి సేకరణదారులు, ఇంచార్జ్లకు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఇంచార్జ్ ఎఫ్ఆర్ఓ ప్రవీణ్ కుమార్, సెక్షన్ ఆఫీసర్లు అతారుద్దీన్, మోహన్రావు, బీట్ ఆఫీసర్లు లక్ష్మీ, షాహిద్, రవీనా పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం