వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మహాత్మ జ్యోతిబా ఫూలే బీసీ బాలుర గురుకుల డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన స్పాట్ అడ్మిషన్లు ఈ నెల 30న నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ పురుషోత్తం తెలిపారు. బీఎస్సీ, బీకాం, బీఏ విభాగాల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.అర్హత కలిగిన విద్యార్థులు సంబంధిత విద్యార్హతల ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.ఎంపికైన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉచిత పాఠ్యపుస్తకాలు, భోజనం, వసతి సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ కోరారు.
Reporter
వాస్తవ గమ్యం