వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల: విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ–2009) అమలులో విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నారని ఆరోపిస్తూ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో విద్యాశాఖ అధికారుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ, కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో ఆర్టీఈ చట్టం ప్రకారం పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వికలాంగ విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించాల్సి ఉన్నా అధికారులు అమలు చేయడం లేదని విమర్శించారు. నిబంధనలను ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవడంతో పాటు ఫీజుల నియంత్రణ చేపట్టి, విద్యా హక్కు చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వివిధ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం