వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న ఈదునూరి సురేందర్ కోర్టు డ్యూటీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను రామగుండం పోలీస్ కమిషనర్ (సీపీ) అంబర్ కిషోర్ ఝా చేతుల మీదుగా ఘన సత్కారం అందుకున్నారు. శనివారం కమిషనరేట్ కార్యాలయంలో సీపీ ఆయనను శాలువాతో సత్కరించి, ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.కోర్టు డ్యూటీల నిర్వహణలో సురేందర్ చూపిన నిబద్ధత, బాధ్యతాయుతమైన పనితీరును సీపీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా కొనియాడారు. ఇదే ఉత్సాహం, స్పూర్తితో భవిష్యత్తులోనూ విధులు నిర్వర్తించి శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. పోలీస్ శాఖలోని ప్రతి అధికారి, సిబ్బంది ఇలాంటి నిబద్ధతను ప్రదర్శిస్తూ ప్రజలకు మరింత మెరుగైన, పారదర్శకమైన సేవలు అందించాలని సీపీ అంబర్ కిషోర్ ఝా పిలుపునిచ్చారు.
Admin
వాస్తవ గమ్యం