Monday, 14 September 2026 10:11:34 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

ఆర్చి లైట్ కంపెనీ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా మందమర్రి టోల్‌గేట్‌లో పెట్రోలింగ్ వాహనాల డ్రైవర్ల సమ్మె

Date : 19 June 2026 05:26 PM Views : 174

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ఆర్చి లైట్ కంపెనీ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో మందమర్రి టోల్‌గేట్ వద్ద పెట్రోలింగ్ వాహనాల డ్రైవర్లు, హెల్పర్లు, ఆర్‌పీఓలు నేటి నుంచి నిరవధిక సమ్మెకు దిగారు ఐఎఫ్‌టీయూ నాయకులు మాట్లాడుతూ, తమ పోరాటాల ఫలితంగా గతంలో కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్, బోనస్, జీవో ప్రకారం కనీస వేతనాలు, పండుగ రోజుల్లో డ్యూటీ చేసిన వారికి డబుల్ వేతనం, జాతీయ పండుగ మాస్టర్లు తదితర హక్కులు సాధించుకున్నామని తెలిపారు. అయితే ఇటీవల ఈ టోల్‌గేట్‌కు ఇన్‌చార్జిగా వచ్చిన జితేందర్ కార్మికుల మధ్య విభేదాలు సృష్టిస్తూ, యూనియన్‌కు దూరంగా ఉండాలని ప్రలోభపెట్టారని ఆరోపించారు. అనంతరం పాత డ్రైవర్లను తొలగించి కొత్త డ్రైవర్లను నియమించడం, యూనియన్‌తో కుదిరిన ఒప్పందం కంటే తక్కువ వేతనాలు చెల్లించడం, పీఎఫ్ నిధులను తక్కువగా జమ చేయడం, పండుగ రోజుల్లో డ్యూటీ చేసిన వారికి అదనపు వేతనాలు ఇవ్వకపోవడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.డ్రైవర్లు అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను కంపెనీ యాజమాన్యం కాలరాస్తోందని, అందుకే ఆర్చి లైట్ కంపెనీకి వ్యతిరేకంగా సమ్మె చేపట్టినట్లు తెలిపారు. ఈ సమ్మెకు భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్‌టీయూ) పూర్తి మద్దతు ప్రకటించింది. కార్మికులు కోల్పోయిన హక్కులను పునరుద్ధరించే వరకు, అలాగే అక్రమంగా తొలగించిన అంబులెన్స్ డ్రైవర్‌ను తిరిగి విధుల్లోకి తీసుకునే వరకు ఈ సమ్మె కొనసాగుతుందని ఐఎఫ్‌టీయూ నాయకులు స్పష్టం చేశారు.ఈ సమ్మెలో మంచిర్యాల జిల్లా ఐఎఫ్‌టీయూ కార్యదర్శి డి. బ్రహ్మానందం, జిల్లా నాయకులు ఎస్. తిరుపతి రెడ్డి, ఎండీ జాఫర్ పాల్గొని తమ మద్దతు తెలిపారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: