Saturday, 13 June 2026 10:42:51 AM
# ఘనంగా రామ్ ప్రసాద్ బిస్మిల్ జయంతి # ​కోటపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన # పేద విద్యార్థుల చదువుల్లో వెలుగులు # *అకెనపల్లిలో గుట్టుచప్పుడు కాకుండా గ్రామసభ.. # గెలిచిన సంఘాల చేతగానితనంతోనే సింగరేణిలో నిలిచిన మెడికల్ బోర్డు: # ​గంగాపూర్ గేట్ ROB భూ సర్వే పూర్తి: గవర్నర్, # ​ఆదివాసీ భూములను లాక్కునే కుట్ర మానుకోవాలి: TAGS # ​మందమర్రిలో ఘనంగా ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ గ్రామ సభ # మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యంపై దాడి # సింగరేణి కాలరీస్ హైస్కూల్ (కల్యాణిఖని)లో ప్రవేశాలు ప్రారంభం # నదీజలాల పంపిణీలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై పార్లమెంట్‌లో నిలదీస్తాం # 16 ఏళ్ల తర్వాత ఒక్కటైన జెడ్పీహెచ్‌ఎస్ తాండూర్ 2010 బ్యాచ్ విద్యార్థులు! # ​మందమర్రి హెడ్ కానిస్టేబుల్ సురేందర్‌కు సీపీ అంబర్ కిషోర్ ఝా ప్రశంసలు # టీపీసీసీ ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా చందనగిరి శ్రీనివాస్.. # కన్నాలలో ‘అమృత్ 2.0’ పనుల పరిశీలన # ప్రత్యేక అవసరాలు గల పిల్లల గుర్తింపు నమోదు ముమ్మరం # తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి # యోగ పట్ల ప్రతి ఒక్కరు ఆసక్తి పెంచుకోవాలి... # అగ్నిప్రమాద బాధితులకు ఆర్థిక సాయం # కలెక్టర్‌ను కలిసిన బెల్లంపల్లి ఏరియా జీఎం

విద్యుత్ ఆర్టిజన్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి: సీఐటీయూ డిమాండ్

Date : 15 April 2026 02:54 PM Views : 76

Vastava Gamyam - తెలంగాణ / మంచిర్యాల : రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఆర్టిజన్ల తమ సమస్యల పరిష్కారం కోసం గత ఏడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన సమ్మెకు మద్దతుగా మంచిర్యాలలో నిరసన జ్వాలలు మిన్నంటాయి.బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించి,స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ధర్నా చేపట్టారు.ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ప్లేకార్డులతో నినదిస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని నాయకులు విమర్శించారు.సమ్మె చేస్తున్న కార్మికులను విధుల్లో నుంచి తొలగిస్తామంటూ బెదిరించడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు.రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 19 వేల మంది ఆర్టిజన్లు, 1,400 మంది అన్మెన్, పీసెట్ కార్మికులు ఈ పోరాటంలో పాల్గొంటున్నారు.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాల్సింది పోయి, కార్మికులను భయభ్రాంతులకు గురిచేయడం సరికాదని పేర్కొన్నారు.కార్మికుల డిమాండ్లు గొంతెమ్మ కోరికలు కావు. ప్రభుత్వం ఇచ్చిన హామీలనే వారు అడుగుతున్నారు. టర్మినేషన్ ఉత్తర్వులతో సమ్మెను అణచివేయాలని చూడటం అగ్నికి ఆజ్యం పోయడమే అవుతుంది." ​ప్రభుత్వం తక్షణమే స్పందించి ట్రాన్స్‌కో, జెన్‌కో, మరియు డిస్కాం పరిధిలోని కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారుఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు సంకె రవి, జిల్లా కమిటీ సభ్యులు గోమాస ప్రకాష్, చిన్నయ్య, మరియు నాయకులు వెంకటేష్, అంజి, కిష్టయ్య, అరుణ్ కుమార్, శ్రీనివాస్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

Vastava Gamyam

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :