Vastava Gamyam - తెలంగాణ / మంచిర్యాల : రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఆర్టిజన్ల తమ సమస్యల పరిష్కారం కోసం గత ఏడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన సమ్మెకు మద్దతుగా మంచిర్యాలలో నిరసన జ్వాలలు మిన్నంటాయి.బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించి,స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ధర్నా చేపట్టారు.ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ప్లేకార్డులతో నినదిస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని నాయకులు విమర్శించారు.సమ్మె చేస్తున్న కార్మికులను విధుల్లో నుంచి తొలగిస్తామంటూ బెదిరించడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు.రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 19 వేల మంది ఆర్టిజన్లు, 1,400 మంది అన్మెన్, పీసెట్ కార్మికులు ఈ పోరాటంలో పాల్గొంటున్నారు.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాల్సింది పోయి, కార్మికులను భయభ్రాంతులకు గురిచేయడం సరికాదని పేర్కొన్నారు.కార్మికుల డిమాండ్లు గొంతెమ్మ కోరికలు కావు. ప్రభుత్వం ఇచ్చిన హామీలనే వారు అడుగుతున్నారు. టర్మినేషన్ ఉత్తర్వులతో సమ్మెను అణచివేయాలని చూడటం అగ్నికి ఆజ్యం పోయడమే అవుతుంది." ప్రభుత్వం తక్షణమే స్పందించి ట్రాన్స్కో, జెన్కో, మరియు డిస్కాం పరిధిలోని కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారుఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు సంకె రవి, జిల్లా కమిటీ సభ్యులు గోమాస ప్రకాష్, చిన్నయ్య, మరియు నాయకులు వెంకటేష్, అంజి, కిష్టయ్య, అరుణ్ కుమార్, శ్రీనివాస్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.
Admin
Vastava Gamyam