Friday, 11 September 2026 03:46:06 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

*జైనూర్ మార్కెట్ కార్యాలయంలో ఘనంగా రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలు*

Date : 20 August 2026 04:17 PM Views : 76

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్.జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని జైనూర్ మార్కెట్ కార్యాలయంలో భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి 82వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జైనూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు *షేక్ రసీద్* ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ *కూడ్మేత విశ్వనాథ్ రావు* మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ దేశ అభివృద్ధి కోసం చేసిన సేవలను స్మరించుకున్నారు. యువతకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించడంతో పాటు, సాంకేతిక రంగంలో భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి, గ్రామీణాభివృద్ధికి రాజీవ్ గాంధీ చేసిన కృషి దేశ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు.18 ఏళ్లు నిండిన ప్రతి యువతీ యువకుడికి ఓటు హక్కు కల్పించడంలో రాజీవ్ గాంధీ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసిందని విశ్వనాథ్ రావు అన్నారు. నేటి యువత రాజీవ్ గాంధీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, సిర్పూర్ మండల అధ్యక్షులు ఆత్రం శంకర్, DCC సబ్బ్యులు పెంధోర్ ప్రకాష్, సర్పంచ్లు రాందాస్, చందంషా,రాస్సిమిట్ట సర్పంచ్ చందు, విఠల్, షేకూ, అబ్బూ, భూపతి, పొలాస ఉపసర్పంచ్ గంగామణి ముఖుందరావు, గోపీచంద్, అజ్జులాలా, దౌలత్ రావ్, దత్తు, రహీం, ఇస్లామ్, నాగేష్, అజీమ్,కోవా సిద్దు దండుగుల మహేష్ క్రిష్ణ మార్కెట్ కమిటీ సిబ్బంది, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు తదితరులు పాల్గొని రాజీవ్ గాంధీకి ఘన నివాళులు అర్పించారు.

Kumram jangu

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: