వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : వాస్తవ గమ్యం.జైనూర్.మండలంలోని పార గ్రామ గ్రామపంచాయతీ ఆవరణలో గ్రామస్తుల సౌకర్యార్థం మాజీ ఎమ్మెల్యే శ్రీ ఆత్రం సక్కు గారి చొరవతో మంజూరైన షేడ్ నిర్మాణ పనులకు శుక్రవారం స్థానిక సర్పంచ్ మెస్రం జంగుబాయి న్యానేశ్వర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులతో కలిసి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కుడ్మేత విశ్వనాథ్ రావ్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. గ్రామపంచాయతీ ఆవరణలో నిర్మించనున్న ఈ షేడ్ గ్రామస్తులకు వివిధ సమావేశాలు, సామాజిక కార్యక్రమాలు, ప్రజా అవసరాల కోసం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులను దశలవారీగా చేపట్టి పార గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. గ్రామ ప్రజలు కూడా అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించి గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపిపి చిర్లే లక్ష్మణ్ , కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ముఖీద్, సర్పంచ్ చందన్ షా, పంచాయతీ కార్యదర్శి ఆనంద్ రావ్ , పార్టీ నాయకులు జన్నవార్ పవన్ కుమార్ దత్తు గ్రామపంచాయతీ సభ్యులు మహిళలు యువకులు గ్రామ పెద్దలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం