Saturday, 12 September 2026 05:36:23 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

*మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ*

Date : 24 July 2026 04:40 PM Views : 120

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : వాస్తవ గమ్యం.జైనూర్.మండలంలోని పార గ్రామ గ్రామపంచాయతీ ఆవరణలో గ్రామస్తుల సౌకర్యార్థం మాజీ ఎమ్మెల్యే శ్రీ ఆత్రం సక్కు గారి చొరవతో మంజూరైన షేడ్ నిర్మాణ పనులకు శుక్రవారం స్థానిక సర్పంచ్ మెస్రం జంగుబాయి న్యానేశ్వర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులతో కలిసి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కుడ్మేత విశ్వనాథ్ రావ్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. గ్రామపంచాయతీ ఆవరణలో నిర్మించనున్న ఈ షేడ్ గ్రామస్తులకు వివిధ సమావేశాలు, సామాజిక కార్యక్రమాలు, ప్రజా అవసరాల కోసం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులను దశలవారీగా చేపట్టి పార గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. గ్రామ ప్రజలు కూడా అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించి గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపిపి చిర్లే లక్ష్మణ్ , కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ముఖీద్, సర్పంచ్ చందన్ షా, పంచాయతీ కార్యదర్శి ఆనంద్ రావ్ , పార్టీ నాయకులు జన్నవార్ పవన్ కుమార్ దత్తు గ్రామపంచాయతీ సభ్యులు మహిళలు యువకులు గ్రామ పెద్దలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Kumram jangu

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :