Wednesday, 29 July 2026 05:45:19 PM
# అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.

మందమర్రి ఎంపీడీవో ఆఫీస్ ముందు మద్యం సీసాలు

Date : 06 July 2026 04:11 PM Views : 83

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి: ప్రజా సమస్యల పరిష్కారానికి నిత్యం వందలాది మంది వచ్చే ప్రభుత్వ కార్యాలయం ఎదుటే మద్యం సేవించడం పరిపాటిగా మారిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం ఉదయం మందమర్రి ఎంపీడీవో కార్యాలయం ప్రాంగణం ముందు మద్యం సీసాలు, ఖాళీ బాటిళ్లు కనిపించడంతో కార్యాలయానికి వచ్చిన ప్రజలు, అధికారులు, సిబ్బంది ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. స్థానికుల కథనం ప్రకారం, రాత్రి వేళల్లో కొందరు మందుబాబులు ఎంపీడీవో కార్యాలయం పరిసరాలను అడ్డాగా మార్చుకుని బహిరంగంగా మద్యం సేవిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మద్యం సేవించిన అనంతరం ఖాళీ సీసాలు, వ్యర్థాలను అక్కడే వదిలివెళ్లడంతో ప్రభుత్వ కార్యాలయ పరిసరాల పరిశుభ్రత దెబ్బతింటోందని, కార్యాలయానికి వచ్చే మహిళలు, వృద్ధులు, ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టరీత్యా నేరమైనప్పటికీ, కొందరు నిబంధనలను బేఖాతరు చేస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాత్రి వేళల్లో పోలీసు నిఘా పెంచాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారగా, సంబంధిత అధికారులు, పోలీసులు స్పందించి కార్యాలయ పరిసరాల్లో భద్రత, పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని పలువురు కోరుతున్నారు.

BEERAM SHARATH CHANDHRA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :