వాస్తవ గమ్యం / తెలంగాణ / హైదరాబాదు : తెలంగాణ రాష్ట్ర కార్మిక మరియు మైనింగ్ శాఖ మంత్రివర్యులు డా. జి. వివేక్ వెంకటస్వామిని నేడు హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్లో ఆర్టీసీ జేఏసీ నేతలు ఘనంగా సత్కరించారు.ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలకు కృతజ్ఞతగా ఈ భేటీ జరిగింది.ఆర్టీసీ కార్మికుల చిరకాల స్వప్నాలను నెరవేరుస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ క్రింది నిర్ణయాల పట్ల నేతలు హర్షం వ్యక్తం చేశారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం. ప్రజాస్వామ్యయుతంగా గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించడం.ఆర్టీసీ కార్మికులకు 11 శాతం పీఆర్సీ ప్రకటించడంతో మంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపినరు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కార్మిక సంఘాల ముఖ్య నేతలు.వెంకన్న,థామస్ రెడ్డి,అశ్వద్ధామ రెడ్డి,హనుమంతు ముదిరాజ్ మరియు ఇతర సంఘాల నాయకులు పాల్గొన్నారు.అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయాలతో కార్మికులకు భరోసా లభించింది. ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసేలా కార్మికులందరూ రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలి.అని అయన కోరారు.
Admin
వాస్తవ గమ్యం