వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జైపూర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్ల విశ్వంభర్ రెడ్డి ఆధ్వర్యంలో జైపూర్ మండల కాంగ్రెస్ కమిటీలో నూతన ప్రధాన కార్యదర్శిగా సుర సంజయ్ ను నియమించారు. ఈ సందర్భంగా సుర సంజయ్ మాట్లాడుతూ తనకి ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలియజేసాడు, జైపూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నాడు. ఈ కార్యక్రమంలో జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ వేముల రవి, రామారావుపేట సర్పంచ్ పులి రాజశేఖర్, ఎలకంటి సర్పంచ్ గుడెల్లి శ్రీనివాసరెడ్డి, వేలాల సర్పంచ్ డేగ స్వప్న–నగేష్, చీర్ల శిశిందర్ యాదవ్, చెన్నూర్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఇలియాజుద్దీన్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ కాసిపేట సతీష్ కుమార్ రామారావుపేట కుల పెద్దమనిషి కుర్మా కాసు బీరయ్య మరియు గ్రామ నాయకులు బొద్దున రాజు జైపూర్ మండల్ యువత పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం