వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆదిలాబాద్ : భీమారం మండలం,ఆరెపల్లి గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సు ను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి చెన్నూర్ కోర్టు న్యాయమూర్తి పి. రవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా అందించే ఉచిత న్యాయ సహాయ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించారు. న్యాయ సహాయం అవసరమైన ప్రతి ఒక్కరూ మండల న్యాయ సేవా సంస్థను సంప్రదించి ఉచిత సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అలాగే కోర్టులలో నిర్వహించే లోక్ అదాలత్ ద్వారా రాజీ పరిష్కారానికి అనుకూలమైన కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవాలని తెలిపారు.అదేవిధంగా గంజాయి, గుడుంబా మరియు ఇతర మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలు, వాటికి సంబంధించిన కఠిన చట్టాలు మరియు శిక్షల గురించి ప్రజలకు వివరించి, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భీమారం ఎస్ఐ ఎ. రాజేందర్, న్యాయవాదులు కె. మహేష్, శ్రీనివాస్, పున్నం, జెక సంజీవ్, కొప్పుల ప్రభాకర్, రమ్య, మమత, ఆరెపల్లి గ్రామ సర్పంచ్ వీరయ్య మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం