Tuesday, 28 July 2026 12:56:28 PM
# కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. # పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి. # చెన్నూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ పతాక దత్తత దినోత్సవం # 54 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు విజయవంతం. # జైపూర్ ఎంపీపీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం.

ఆరేపల్లి గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సు.

Date : 20 July 2026 07:46 PM Views : 68

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆదిలాబాద్ : భీమారం మండలం,ఆరెపల్లి గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సు ను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి చెన్నూర్ కోర్టు న్యాయమూర్తి పి. రవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా అందించే ఉచిత న్యాయ సహాయ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించారు. న్యాయ సహాయం అవసరమైన ప్రతి ఒక్కరూ మండల న్యాయ సేవా సంస్థను సంప్రదించి ఉచిత సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అలాగే కోర్టులలో నిర్వహించే లోక్ అదాలత్ ద్వారా రాజీ పరిష్కారానికి అనుకూలమైన కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవాలని తెలిపారు.అదేవిధంగా గంజాయి, గుడుంబా మరియు ఇతర మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలు, వాటికి సంబంధించిన కఠిన చట్టాలు మరియు శిక్షల గురించి ప్రజలకు వివరించి, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భీమారం ఎస్‌ఐ ఎ. రాజేందర్, న్యాయవాదులు కె. మహేష్, శ్రీనివాస్, పున్నం, జెక సంజీవ్, కొప్పుల ప్రభాకర్, రమ్య, మమత, ఆరెపల్లి గ్రామ సర్పంచ్ వీరయ్య మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

MANTHRI GAJANAND

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :