వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి, జూన్ 26:పట్టణంలో మొహర్రం వేడుకలు శుక్రవారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి. హిందూ, ముస్లిం భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని, అలంకరించిన పీరీలను దర్శించుకున్నారు. హజ్రత్ ఇమామ్ హుస్సేన్ త్యాగాన్ని స్మరిస్తూ భక్తులు సంతాపం ప్రకటించారు. పీరీలకు షర్బత్, మలీదా, దట్టీలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు, మున్సిపల్ అధికారులు, పీర్ల గుండాల కమిటీ సభ్యులు ముందస్తుగా ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో వేడుకలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి.
Reporter
వాస్తవ గమ్యం