Vastava Gamyam - తెలంగాణ / ఆదిలాబాద్ : అడవులు, వన్యప్రాణులను సంరక్షించి భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎఫ్ఆర్వో శ్రీనివాస్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం సిర్పూర్ రేంజ్ కార్యాలయంలో విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించి ప్రకృతి వనరుల పరిరక్షణపై అవగాహన కల్పించారు. గతంతో పోలిస్తే అటవీ సంపద, కొన్ని వన్యప్రాణుల జాతులు తగ్గిపోయాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్వో తిరుపతి, సెక్షన్ అధికారులు మోహన్రావు, బాలాజీ, అటవీ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Vastava Gamyam