వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టి) మండల కేంద్రంలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా సిర్పూర్(టి) రైతు వేదికలో మండల స్థాయి సమావేశం నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారి అజ్మీర ధర్మేంద్ర అధ్యక్షతన, ఎంపీడీవో పి. సత్యనారాయణ పర్యవేక్షణలో సభ జరిగింది. కార్యక్రమంలో డీఎస్పీ, సీఐ, తహసీల్దార్, ఎస్ఐ, ఎంఏఓ, ఎంఈఓ, ఏఈలు, వైద్య అధికారులు, ఐసీడీఎస్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు, సభ్యులు, రైతులు పాల్గొన్నారు. గ్రామాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు.
Admin
వాస్తవ గమ్యం