Saturday, 13 June 2026 09:40:20 AM
# ఘనంగా రామ్ ప్రసాద్ బిస్మిల్ జయంతి # ​కోటపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన # పేద విద్యార్థుల చదువుల్లో వెలుగులు # *అకెనపల్లిలో గుట్టుచప్పుడు కాకుండా గ్రామసభ.. # గెలిచిన సంఘాల చేతగానితనంతోనే సింగరేణిలో నిలిచిన మెడికల్ బోర్డు: # ​గంగాపూర్ గేట్ ROB భూ సర్వే పూర్తి: గవర్నర్, # ​ఆదివాసీ భూములను లాక్కునే కుట్ర మానుకోవాలి: TAGS # ​మందమర్రిలో ఘనంగా ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ గ్రామ సభ # మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యంపై దాడి # సింగరేణి కాలరీస్ హైస్కూల్ (కల్యాణిఖని)లో ప్రవేశాలు ప్రారంభం # నదీజలాల పంపిణీలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై పార్లమెంట్‌లో నిలదీస్తాం # 16 ఏళ్ల తర్వాత ఒక్కటైన జెడ్పీహెచ్‌ఎస్ తాండూర్ 2010 బ్యాచ్ విద్యార్థులు! # ​మందమర్రి హెడ్ కానిస్టేబుల్ సురేందర్‌కు సీపీ అంబర్ కిషోర్ ఝా ప్రశంసలు # టీపీసీసీ ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా చందనగిరి శ్రీనివాస్.. # కన్నాలలో ‘అమృత్ 2.0’ పనుల పరిశీలన # ప్రత్యేక అవసరాలు గల పిల్లల గుర్తింపు నమోదు ముమ్మరం # తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి # యోగ పట్ల ప్రతి ఒక్కరు ఆసక్తి పెంచుకోవాలి... # అగ్నిప్రమాద బాధితులకు ఆర్థిక సాయం # కలెక్టర్‌ను కలిసిన బెల్లంపల్లి ఏరియా జీఎం

​కోటపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన

ప్రజల దాహాన్ని పట్టించుకోని తహసీల్దార్ ను సస్పెండ్ చేయాలి: తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్

Date : 11 June 2026 03:58 PM Views : 69

Vastava Gamyam - తెలంగాణ / మంచిర్యాల : ​మంచిర్యాల జిల్లా,కోటపల్లి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు, రైతులకు కనీస త్రాగునీటి సౌకర్యం కల్పించడంలో వైఫల్యం చెందిన తహసీల్దార్ రాఘవేందర్ రావును తక్షణమే సస్పెండ్ చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం కోటపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఎర్మ పున్నం మాట్లాడుతూ, నిత్యం వందలాది మంది ప్రజలు, రైతులు వివిధ పనుల నిమిత్తం వచ్చే తహసీల్దార్ కార్యాలయంలో త్రాగునీరు లేకపోవడం అత్యంత విచారకరమన్నారు. గత సంవత్సర కాలంగా ఇక్కడ త్రాగునీటి సదుపాయం కల్పించాలని అనేక దఫాలుగా వినతిపత్రాలు సమర్పించినప్పటికీ, తహసీల్దార్ రాఘవేందర్ రావు ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.కార్యాలయానికి వచ్చే ప్రజలు త్రాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ తీవ్రతకు డీహైడ్రేషన్‌కు గురై అనారోగ్యం పాలైతే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు అని ఆయన ప్రశ్నించారు.కార్యాలయం వద్ద త్రాగునీటి సౌకర్యం కల్పించని తహసీల్దార్‌పై తక్షణమే సస్పెన్షన్ వేటు వేయాలని, లేనిపక్షంలో కలెక్టరేట్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు మర్మల శంకర్, నాగమల్లు, మడే వెంకటేష్, భీమేష్, గంగారాం తదితరులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

Vastava Gamyam

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :