Sunday, 13 September 2026 08:39:08 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

​కోటపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన

ప్రజల దాహాన్ని పట్టించుకోని తహసీల్దార్ ను సస్పెండ్ చేయాలి: తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్

Date : 11 June 2026 03:58 PM Views : 136

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ​మంచిర్యాల జిల్లా,కోటపల్లి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు, రైతులకు కనీస త్రాగునీటి సౌకర్యం కల్పించడంలో వైఫల్యం చెందిన తహసీల్దార్ రాఘవేందర్ రావును తక్షణమే సస్పెండ్ చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం కోటపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఎర్మ పున్నం మాట్లాడుతూ, నిత్యం వందలాది మంది ప్రజలు, రైతులు వివిధ పనుల నిమిత్తం వచ్చే తహసీల్దార్ కార్యాలయంలో త్రాగునీరు లేకపోవడం అత్యంత విచారకరమన్నారు. గత సంవత్సర కాలంగా ఇక్కడ త్రాగునీటి సదుపాయం కల్పించాలని అనేక దఫాలుగా వినతిపత్రాలు సమర్పించినప్పటికీ, తహసీల్దార్ రాఘవేందర్ రావు ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.కార్యాలయానికి వచ్చే ప్రజలు త్రాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ తీవ్రతకు డీహైడ్రేషన్‌కు గురై అనారోగ్యం పాలైతే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు అని ఆయన ప్రశ్నించారు.కార్యాలయం వద్ద త్రాగునీటి సౌకర్యం కల్పించని తహసీల్దార్‌పై తక్షణమే సస్పెన్షన్ వేటు వేయాలని, లేనిపక్షంలో కలెక్టరేట్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు మర్మల శంకర్, నాగమల్లు, మడే వెంకటేష్, భీమేష్, గంగారాం తదితరులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :