వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు శ్రీమతి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణను యువజన కాంగ్రెస్ మంచిర్యాల జిల్లా సెక్రటరీ మహంతి అర్జున్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన ప్రత్యక్ష దాడి అని ఆయన మండిపడ్డారు. మోడీ – అమిత్ షా నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కే కుట్రలకు పాల్పడుతోందని, అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలవనీయకుండా చేయడం దుర్మార్గమని విమర్శించారు. చెన్నూరు ఎమ్మెల్యే, మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డిల నాయకత్వంలో మందమర్రి అంబేద్కర్ చౌక్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు వినతి పత్రాన్ని సమర్పించారు.రాజ్యాంగ స్ఫూర్తిని, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని ఈ సందర్భంగా అర్జున్ కుమార్ స్పష్టం చేశారు
Admin
వాస్తవ గమ్యం