Vastava Gamyam - తెలంగాణ / ఆసిఫాబాద్ : కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండల కేంద్రంలో బుధవారం జగదాంబ దేవి, సంత్ సేవాలాల్ మహారాజ్, సంత్ తపస్వి డాక్టర్ రామారావ్ మహారాజ్ భోగ్ భండార్ కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. అఖిల భారత బంజారా సేవా సంఘ జిల్లా అధ్యక్షుడు రాథోడ్ రవీందర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పొవరా దేవి పీఠాధిపతి శ్రీ బాబూసింగ్ మహారాజ్ లింగాపూర్ గ్రామస్తుల సమస్యలు తెలుసుకున్నారు. బంజారా సమాజంలో యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, భక్తి-ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకోవాలని పిలుపిచ్చారు. సేవాలాల్ మహారాజ్ బోధనలను అనుసరించి ఇతరులతో గౌరవంగా మెలగాలని, అబద్ధాలు, దొంగతనాలు, గుడుంబా వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలని పెళ్లిళ్లు-శుభకార్యాలలో అనవసర ఖర్చులు తగ్గించాలని సూచించారు.కార్యక్రమంలో గ్రామ నాయక్ రాథోడ్ కిరణ్ నాయక్, కారోబారి రాథోడ్ శివలాల్, సర్పంచ్ జాదవ్ రాజశేఖర్, మందిర పూజారి రాథోడ్ మంగులాల్ మహారాజ్, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, ధర్మ ప్రచారకర్తలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Admin
Vastava Gamyam