Friday, 11 September 2026 03:45:36 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

ఆదిల్ పేట్ ఎర్ర చెరువు భూములపై విచారణ జరపాలి

Date : 17 August 2026 03:43 PM Views : 103

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి: ఆదిల్ పేట్ గ్రామ పరిధిలోని ఎర్ర చెరువు అభివృద్ధి కోసం ప్రభుత్వం గతంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన 30 ఎకరాలకు పైగా భూమిని పరిరక్షించాలని, ఆ భూములపై ఆక్రమణల ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలని TVJS మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బచ్చలి ప్రవీణ్‌కుమార్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.ఎర్ర చెరువు ఈ ప్రాంత రైతులకు ప్రధాన సాగునీటి ఆధారంగా ఉందని, చెరువు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచి దిగువన ఉన్న చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రజాధనంతో భూములను కొనుగోలు చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఆ భూములు ఇతరుల ఆధీనంలో ఉన్నట్లు సమాచారం ఉందని, ప్రభుత్వం కొనుగోలు చేసిన భూములు తిరిగి ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలోకి వెళ్లిన పరిస్థితిపై సమగ్ర విచారణ అవసరమని కోరారు.రెవెన్యూ, నీటిపారుదల శాఖల ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో సంయుక్త సర్వే నిర్వహించి ప్రభుత్వం కొనుగోలు చేసిన భూములను గుర్తించి, వాటిని పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆక్రమణలు నిజమని తేలితే చట్ట ప్రకారం తొలగించడంతో పాటు, ప్రభుత్వ భూముల పరిరక్షణలో నిర్లక్ష్యం వహించిన అధికారుల బాధ్యతను కూడా నిర్ధారించాలని కోరారు.అలాగే ప్రజాధనంతో కొనుగోలు చేసిన భూముల ఉద్దేశ్యం నెరవేరేలా ఎర్ర చెరువు అభివృద్ధి పనులు చేపట్టి, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా శాశ్వత చర్యలు తీసుకోవాలని కోరారు. విచారణ అనంతరం తీసుకున్న చర్యలను లిఖితపూర్వకంగా ప్రజలకు తెలియజేయాలని ప్రజావాణి ప్రత్యేక అధికారిని కోరారు.ఈ ఫిర్యాదు ప్రతులను మంచిర్యాల జిల్లా కలెక్టర్, RDO, నీటిపారుదల శాఖ EE, CCLA, రెవెన్యూ మరియు నీటిపారుదల శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలకు పంపినట్లు తెలిపారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: