వాస్తవ గమ్యం / తెలంగాణ / నిర్మల్ : నిర్మల్ జిల్లా, ఖానాపూర్, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్య ఘర్ బిజిలి పథకాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలు లబ్ధి పొందాలని చిన్నారి స్వచ్ఛంద సంస్థ చైర్మన్ పాల్ కరుణాకర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఖానాపూర్ మండలం సత్తెనపల్లి గ్రామంలో పీఎం సూర్య ఘర్ బిజిలి పథకం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ పథకం ద్వారా సోలార్ విద్యుత్ ఉపయోగం,వినియోగం పై రైతులకు, ప్రజలకు అవగాహన కలుగజేశారు. ఈ పథకానికి బ్యాంకుల నుంచి 78,000 సబ్సిడీ కూడా లభిస్తుందని పేర్కొన్నారు. గృహ అవసరాలకు వినియోగించుకోగా, అదనపు విద్యుత్తును విద్యుత్ శాఖకు విక్రయించుకోవడానికి, తద్వారా ఆర్థిక లబ్ధి పొందడానికి కూడా అవకాశం ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు జక్కుల నరసయ్య ,జక్కుల చంద్రకళ, మద్దెలపల్లి రాజ్ కుమార్ ,మద్దెలపల్లి మహేందర్ ,రాములు, పలువురు పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం