వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి: మహిళలు, బాలికలు ఎలాంటి వేధింపులకు గురైనా భయపడకుండా వెంటనే షీ టీమ్స్ను ఆశ్రయించాలని మంచిర్యాల జిల్లా షీ టీమ్ పోలీసులు పిలుపు నిచ్చారు.రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాలు, మంచిర్యాల డీసీపీ భాస్కర్ పర్యవేక్షణలో, మంచిర్యాల జిల్లా షీ టీమ్ ఎస్ఐ హైమ ఆధ్వర్యంలో మందమర్రిలోని తెలంగాణ మోడల్ స్కూల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవ్టీజింగ్, సైబర్ నేరాలు, మానవ అక్రమరవాణా, ట్రాఫిక్ నియమాలు, టీ-సేఫ్ యాప్, షీ టీమ్స్ సేవలపై వివరించారు.అత్యవసర పరిస్థితుల్లో డయల్-100, రామగుండం షీ టీమ్ వాట్సాప్ నంబర్ 6303923700, మంచిర్యాల జిల్లా షీ టీమ్ నంబర్ 8712659385లకు సమాచారం ఇవ్వాలని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో షీ టీమ్ కానిస్టేబుళ్లు శ్రవణ్, శ్రీలత, పాఠశాల ప్రిన్సిపాల్ సారా తస్నీం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం