Wednesday, 29 July 2026 11:28:53 PM
# ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి:

ఇందారం 1A గని మేనేజర్ కోటయ్య తీరుపై హెచ్.ఎం.ఎస్ ఆగ్రహం

​కార్మికులను వేధిస్తే సహించేది లేదు రాష్ట్ర అధ్యక్షుడు తిప్పారపు సారయ్య హెచ్చరిక

Date : 10 April 2026 12:47 PM Views : 651

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ​శ్రీరాంపూర్/జైపూర్ మండలంలోని ఇందారం 1ఏ గని మేనేజర్ కోటయ్య కార్మికుల పట్ల అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని మార్చుకోవాలని (హింద్ మజ్దూర్ సభ) యూనియన్ డిమాండ్ చేసింది. కార్మికులను అసభ్య పదజాలంతో దూషించడం,చిన్న చిన్న కారణాలకే సస్పెన్షన్లు, చార్జిషీట్లు ఇస్తూ మానసిక వేధింపులకు గురిచేయడం తగదని యూనియన్ నాయకులు మండిపడ్డారు.గనిలో కనీస సౌకర్యాలు కల్పించడంలో మేనేజ్మెంట్ విఫలమైందని నాయకులు విమర్శించారు. ప్రధానంగా గనిలో ఎదురవుతున్న ఇబ్బందులను ఈ విధంగా వివరించారు.మొదటి షిఫ్ట్ కార్మికులను మధ్యాహ్నం 3 గంటల వరకు గని లోపలే ఉండాలని బలవంతం చేయడం.16 చేతి కుక్కులు ఉండాల్సిన చోట కేవలం 5 మాత్రమే ఉండటం, అవి కూడా నాణ్యత లేనివి కావడం.కార్మికులకు నాణ్యమైన చేతి గ్లౌజులు సరఫరా చేయకపోవడం.గని లోపల త్రాగునీరు, సరైన వెంటిలేషన్ మరియు మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడం వల్ల కార్మికులు నరకయాతన అనుభవిస్తున్నారు.టబ్బు క్లీనింగ్ చేసేవారిని,కేబుల్ బాయ్‌లను ఇతర పనులకు మళ్లించడం వల్ల పని భారం పెరుగుతోంది.​మేనేజర్ కోటయ్య కార్మికుల సమస్యలను వినకుండా అవమానిస్తూ వెనక్కి పంపుతున్నారని, యూనియన్ మీటింగ్స్ జరగకుండా ఓవర్‌మెన్ల ద్వారా ఒత్తిడి తెస్తున్నారని నాయకులు ఆరోపించారు. ఈ సమస్యలన్నింటిపై ఆపరేషన్ అధికారి మీస నాగన్నకు (హెచ్ ఎం స్) నాయకులు వినతి పత్రం సమర్పించారు. తక్షణమే మేనేజర్‌పై చర్యలు తీసుకోవాలని, సమస్యలను పరిష్కరించాల కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు తిప్పారపు సారయ్య, శ్రీరాంపూర్ వైస్ ప్రెసిడెంట్ వంటకాల అనిల్ రెడ్డి, నాయకులు దుర్గ ప్రసాద్, శ్రీనివాస్, రమేష్ మరియు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: