వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : వాస్తవ గమ్యం : ఆగస్ట్ 19 కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యు కానిస్టేబుల్ నియామక నోటిఫికేషన్లో జీవో నంబర్ 109 ప్రకారం ఏజెన్సీ ప్రాంత అభ్యర్థులకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర ఏజెన్సీ బంద్ పిలుపు మేరకు బుధవారం జైనూర్ మండలంలో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు, దుకాణాలను స్వచ్ఛందంగా పూర్తిస్థాయిలో బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు మధురాజ్ మడావి మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతంలో విద్య, ఉద్యోగ నియామకాల్లో స్థానిక ఆదివాసీ అభ్యర్థులకు ప్రత్యేక రిజర్వేషన్ను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా పోలీస్ కానిస్టేబుల్ నియామక నోటిఫికేషన్లో ఏజెన్సీ ప్రాంత ఆదివాసీ అభ్యర్థులకు 75 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా ఆదివాసీ నిరుద్యోగ యువతకు న్యాయం జరిగేలా జీవో నంబర్ 3ను పునరుద్ధరించాలని, ఏజెన్సీ ప్రాంత హక్కులను కాపాడేందుకు 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఏజెన్సీ ప్రాంత ప్రజల హక్కులు, విద్యార్థులు మరియు నిరుద్యోగ యువత భవిష్యత్తు కోసం చేపట్టిన ఈ బంద్కు విద్యాసంస్థలు, వ్యాపారులు, ప్రజలు సహకరించి విజయవంతం చేశారని తెలిపారు.
Reporter
వాస్తవ గమ్యం