Friday, 11 September 2026 02:48:23 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

దోమల బెడదతో ప్రజల అవస్థలు – అధికారులు జర వెంటనే చర్యలు తీసుకోండి సార్

Date : 07 August 2026 03:47 PM Views : 60

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల పట్టణంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దోమల ఉద్ధృతి తీవ్రంగా పెరిగి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. ముఖ్యంగా కాలనీల్లో చిన్నపిల్లలు దోమల కాట్లతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. దోమలు కుట్టడంతో పిల్లలు ఒంటిపై, చేతులు, కాళ్లపై గోకుకోవడం వల్ల చర్మ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పట్టణంలోని పలు కాలనీల్లో చెత్త పేరుకుపోవడం, డ్రైనేజీలు సక్రమంగా పనిచేయకపోవడం వల్ల దోమల వ్యాప్తి మరింత పెరుగుతోందని ప్రజలు చెబుతున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి కాలనీల్లో దోమల నివారణ కోసం ఫాగింగ్ (పొగ స్ప్రే) నిర్వహించాలని, డ్రైనేజీలు, వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు (హెల్త్ క్యాంపులు) ఏర్పాటు చేసి అవసరమైన వైద్య సేవలు, మందులు అందించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకుని దోమల నివారణతో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాలను ముమ్మరం చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

KAGITHAPU SRINIVAS

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :