Tuesday, 28 July 2026 08:05:10 PM
# అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.

మందమర్రి మున్సిపాలిటీలో ఘనంగా జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం

Date : 28 June 2026 05:29 PM Views : 232

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి, జూలై 27: మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని దీపక్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్‌లో ఆదివారం జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ టి. రాజలింగు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన 0 నుంచి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా కమిషనర్ టి. రాజలింగు మాట్లాడుతూ, "0 నుంచి 5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి రెండు పోలియో చుక్కలు వేయించడం ద్వారా జీవితాంతం పోలియో వ్యాధి నుంచి రక్షణ లభిస్తుంది. చిన్నారుల ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని" కోరారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ జాహ్నవి, మెడికల్ ఆఫీసర్, అర్బన్ హెల్త్ సెంటర్ దీపక్ నగర్ వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, ఇన్‌చార్జి టౌన్ మిషన్ కోఆర్డినేటర్ ఏ. రఘురాం, మెప్మా సిబ్బంది, రిసోర్స్ పర్సన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వైద్య ఆరోగ్య సిబ్బందికి, ఆశా వర్కర్లకు, ప్రజాప్రతినిధులకు మున్సిపల్ కమిషనర్ టి. రాజలింగు కృతజ్ఞతలు తెలిపారు

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :