Vastava Gamyam - తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలో ముఖ్యమంత్రి పర్యటనకు ముందు బీజేపీ ఆత్మనిర్భర్ భారత్ జిల్లా కన్వీనర్ కేసరి ఆంజనేయులు గౌడ్ను పోలీసులు ముందస్తుగా నిర్బంధించి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎన్నికల హామీల అమలు, ప్రజా సమస్యలపై నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ముందస్తు అరెస్టులు, అక్రమ నిర్బంధాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మల్రాజ్ రాంబాబు, పందిర్ల మదనయ్యలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
Admin
Vastava Gamyam