వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జైపూర్ మండల కేంద్రంలోని ఎస్టీపీపీ డిస్పెన్సరీలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఈడి చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరై సేవాపథంలో నర్సుల కృషి అమూల్యమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆధునిక నర్సింగ్ వ్యవస్థకు ఆద్యురాలైన ఫ్లోరెన్స్ నైటింగేల్ సేవలను స్మరించుకుంటూ, వైద్య రంగంలో నర్సులు "దేవదూతలు" అని కొనియాడారు. రోగుల పట్ల ప్రేమ, ఓర్పుతో వారు అందించే నిస్వార్థ సేవ అపారమైనదని, ముఖ్యంగా కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి పనిచేశారని ప్రశంసించారు. అనంతరం నైటింగేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి, కొవ్వొత్తులు వెలిగించి కేక్ కట్ చేశారు. ఇదే క్రమంలో ఉత్తమ సేవలందించిన సీనియర్ స్టాఫ్ నర్సు శ్రీమతి రాజమణిని ఈడీ చిరంజీవి శాలువాతో సన్మానించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జీఎంలు ఎం. నరసింహారావు, ఎం. మదన్ మోహన్, ఏజీఎంలు సూర్యనారాయణ రాజు, పంతులా, ఫిట్ సెక్రెటరీ సత్యనారాయణ, మెడికల్ సూపరింటెండెంట్ బి. జానకి, వెంకటయ్య, మోహన్ సింగ్, రిటైర్డ్ డాక్టర్ ప్రభాకర్ తదితర అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు
Admin
వాస్తవ గమ్యం