వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి పట్టణంలో స్థానిక పాత్రికేయుల ఐక్యత, సంక్షేమం లక్ష్యంగా నూతనంగా ‘కల్యాణిఖని ప్రెస్ క్లబ్’ ఆవిర్భవించింది. పట్టణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నూతన ప్రెస్ క్లబ్తో పాటు కార్యవర్గాన్ని ఏకగ్రీవంగాఎన్నుకున్నారు. క్లబ్ నూతన ప్రెసిడెంట్గా పార్వతి రాజేష్, జనరల్ సెక్రటరీగా రామ్ వేణు, కోశాధికారి తెల్ల విజయ్ కుమార్ ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులు. గౌరవ సలహాదారు: కనపర్తి రమేష్,వర్కింగ్ ప్రెసిడెంట్: కొమ్ము రాజేష్ వైస్ ప్రెసిడెంట్లు:మదాసు కుమార్.గరిగే సుమన్ ఎగుడ రాయమల్లు.జాయింట్ సెక్రటరీలు:మాసు రాకేశ్. కంది రాజేశం కాగితపు శ్రీనివాస్ లీగల్ అడ్వైజర్: అడిచెర్ల నాగేందర్ పీఆర్వో / క్లబ్ ఇంచార్జి: బీరం రవి ఎగ్జిక్యూటివ్ మెంబర్: జీవన్ కుమార్ నూతనంగా ఏర్పాటైన ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు, సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని నూతన కార్యవర్గ సభ్యులు తెలిపారు. మందమర్రిలో కొత్త ప్రెస్ క్లబ్ ఏర్పాటు కావడంపై తోటి పాత్రికేయులు, పట్టణ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. త్వరలో నూతన క్లబ్ ప్రారంభోత్సవానికి ప్రతి ఒక్కరికి ఆహ్వానం ఉంటుందని అన్నారు.....
Admin
వాస్తవ గమ్యం