Tuesday, 28 July 2026 05:32:00 PM
# తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. # పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి. # చెన్నూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ పతాక దత్తత దినోత్సవం

సీపీఐ మందమర్రి మండల నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

Date : 10 July 2026 04:54 PM Views : 172

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : సీపీఐ మందమర్రి మండల నూతన కమిటీని శుక్రవారం స్థానిక ఏఐటీయూసీ కార్యాలయంలో జరిగిన మండల సమితి సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా సమితి సభ్యులు కాదండి సాంబయ్య అధ్యక్షతన జరిగిన సమావేశానికి సీపీఐ మంచిర్యాల జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ నిర్మాణం, ప్రజా ఉద్యమాల బలోపేతంపై దిశానిర్దేశం చేశారు.సమావేశంలో 13 మంది సభ్యులతో కూడిన మండల కార్యవర్గం, 21 మంది సభ్యులతో కూడిన మండల కౌన్సిల్‌ను ఏకగ్రీవంగా ఆమోదించి నూతన మండల కమిటీని ప్రకటించారు. మండల కార్యదర్శిగా వనం సత్యనారాయణ, సహాయ కార్యదర్శిగా తాళ్లపల్లి వీరయ్య, కోశాధికారిగా బండారి రాజేశం, మండల ఆర్గనైజింగ్ కార్యదర్శిగా రోడ్డ నరేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా రామడుగు లక్ష్మణ్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరిస్తూ పోరాటాలను మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, యువత, మహిళల సమస్యల పరిష్కారానికి సీపీఐ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. నూతన కమిటీ సభ్యులు పార్టీ సిద్ధాంతాలను గ్రామ గ్రామానికి తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఇప్పకాయల లింగయ్య, జిల్లా సమితి సభ్యులు మిట్టపల్లి పౌలు, నక్క వెంకట్‌స్వామి, మామిడి గోపి, మహిళా నాయకురాలు రోడ్డ తిరుమలతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: