వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా శుక్రవారం మందమర్రిలోని హరి హరి దేవస్థానంలో సంతోషిమాతకు ప్రత్యేక పూజా మహోత్సవం వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఆలయ అర్చకులు అమ్మవారికి పంచామృతాభిషేకం, విశేష అర్చనలు నిర్వహించి, వివిధ రకాల పూలతో సుందరంగా అలంకరించారు.శ్రావణ శుక్రవారం కావడంతో మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో దేవస్థానానికి తరలివచ్చి సంతోషిమాతను దర్శించుకున్నారు. మహిళలు సామూహిక కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించి తమ కుటుంబాలు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించారు.అనంతరం దేవస్థానం నిర్వాహకుల ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో ఎలాంటి అసౌకర్యం కలగలేదు. దేవస్థాన ప్రాంగణం అమ్మవారి నామస్మరణలతో మార్మోగింది.
Reporter
వాస్తవ గమ్యం