Tuesday, 28 July 2026 12:55:38 PM
# కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. # పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి. # చెన్నూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ పతాక దత్తత దినోత్సవం # 54 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు విజయవంతం. # జైపూర్ ఎంపీపీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం.

సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు

అదనపు కలెక్టర్ వి. రాములు

Date : 23 July 2026 07:04 PM Views : 19

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) బకాయిలను తక్షణమే పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు రైస్ మిల్లుల యాజమాన్యాలకు ఆదేశించారు.గురువారం జన్నారం మండలం పొనకల్ గ్రామంలోని శ్రీ శివసాయి రాఘవేంద్ర రైస్ మిల్లు, మర్రిగూడలోని రాజరాజేశ్వరి రైస్ మిల్లు, దండేపల్లి మండలం లింగాపూర్‌లోని శ్రీ కృష్ణ అగ్రో ఇండస్ట్రీస్, పెద్దపేటలోని భవాని ఇండస్ట్రీస్, కన్నెపల్లిలోని వెంకటేశ్వర పీబీఆర్‌ఎం, రాధాకృష్ణ ఇండస్ట్రీస్ రైస్ మిల్లులను తహసీల్దార్లతో కలిసి పరిశీలించారు. అనంతరం అధికారులతో సీఎంఆర్ పెండింగ్‌పై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా 2025–26 వానాకాలం, యాసంగి సీజన్‌లకు సంబంధించిన సీఎంఆర్ బియ్యం పురోగతిని సమీక్షించిన అదనపు కలెక్టర్, గడువులోగా సీఎంఆర్‌ను పూర్తి చేయని రైస్ మిల్లుల నుంచి ధాన్యాన్ని మెరుగైన పనితీరు కనబరిచే ఇతర మిల్లులకు తరలించే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం జన్నారం, దండేపల్లి తహసీల్దార్ కార్యాలయాలను సందర్శించి ఎస్‌ఐఆర్ ప్రక్రియ పురోగతిని సమీక్షించారు. సాదాబైనామా, భూ భారతి, రెవెన్యూ సదస్సుల దరఖాస్తుల స్థితిగతులను పరిశీలించి, 60 రోజులకు పైగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ప్రాధాన్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.అలాగే ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్‌ను వేగవంతం చేసి, పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జన్నారం, దండేపల్లి మండలాల తహసీల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

KAGITHAPU SRINIVAS

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :