వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జిల్లాలో పెండింగ్లో ఉన్న కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) బకాయిలను తక్షణమే పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు రైస్ మిల్లుల యాజమాన్యాలకు ఆదేశించారు.గురువారం జన్నారం మండలం పొనకల్ గ్రామంలోని శ్రీ శివసాయి రాఘవేంద్ర రైస్ మిల్లు, మర్రిగూడలోని రాజరాజేశ్వరి రైస్ మిల్లు, దండేపల్లి మండలం లింగాపూర్లోని శ్రీ కృష్ణ అగ్రో ఇండస్ట్రీస్, పెద్దపేటలోని భవాని ఇండస్ట్రీస్, కన్నెపల్లిలోని వెంకటేశ్వర పీబీఆర్ఎం, రాధాకృష్ణ ఇండస్ట్రీస్ రైస్ మిల్లులను తహసీల్దార్లతో కలిసి పరిశీలించారు. అనంతరం అధికారులతో సీఎంఆర్ పెండింగ్పై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా 2025–26 వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ బియ్యం పురోగతిని సమీక్షించిన అదనపు కలెక్టర్, గడువులోగా సీఎంఆర్ను పూర్తి చేయని రైస్ మిల్లుల నుంచి ధాన్యాన్ని మెరుగైన పనితీరు కనబరిచే ఇతర మిల్లులకు తరలించే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం జన్నారం, దండేపల్లి తహసీల్దార్ కార్యాలయాలను సందర్శించి ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతిని సమీక్షించారు. సాదాబైనామా, భూ భారతి, రెవెన్యూ సదస్సుల దరఖాస్తుల స్థితిగతులను పరిశీలించి, 60 రోజులకు పైగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులను ప్రాధాన్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.అలాగే ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ను వేగవంతం చేసి, పెండింగ్లో ఉన్న అన్ని పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జన్నారం, దండేపల్లి మండలాల తహసీల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం