వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కొన్ని ఎరువుల దుకాణాల్లో రైతులను అధిక ధరలతో దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం డీఏపీ బస్తా సుమారు ₹1350కు అందుబాటులో ఉండాల్సి ఉండగా, కొన్ని దుకాణాల్లో ₹1750 నుంచి ₹1850 వరకు విక్రయిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విత్తనాల సీజన్లో రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఇష్టారాజ్యంగా ధరలు వసూలు చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయం. సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే తనిఖీలు నిర్వహించి, అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.రైతులను దోచుకోవడం ఆపాలి – ఎంఆర్పీ ధరలకే డీఏపీ, యూరియా ఎరువులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి.
Reporter
వాస్తవ గమ్యం